TEJA NEWS

నేపాల్‌లో ఘోర ప్రమాదం::నదిలో పడిన భారత ప్రయాణికుల బస్సు

హైదరాబాద్
నేపాల్‌ తనహున్‌ జిల్లాలోఈరోజు ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి మరయంగ్డి నదిలో ఓ ప్రవేట్ టూరిస్ట్‌ బస్సు పడింది.

ప్రమాద సమయంలో బస్సు లో 40 మంది భారతీయు లు ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లంతా యూపీకి చెందిన వారిగా అక్కడి అధికారులు చెబుతున్నారు.

బస్సు కూడా యూపీకి చెందినదిగా గుర్తించారు. పొఖారా నుంచి ఖాట్మండు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. భారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు అందాల్సి ఉంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS