Ashala protest under CITU in front of Collectorate.
లెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశాల నిరసన.
జగిత్యాల జిల్లా : ఆశా వర్కర్లకు నష్టం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.
టార్గెట్ ఇస్తూ పని ఒత్తిడి తీసుకువస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న పై అధికారులపై చర్యలు చేపట్టాలని నిరసన వ్యక్తం చేశారు.
పని భారం తగ్గించే విధంగా జాబ్ చార్జ్ ఉత్తర్వులను ఇవ్వాలని కోరారు.
జీతాలు చెల్లించడంలో ఆలస్యం చేయకుండా ప్రతినిలో రెండవ తారీఖునే శాలరీలు అందజేయాలని డిమాండ్ చేశారు.
ఇవే కాకుండా ఆశ వర్కర్ల ఇతర న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు…
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-13-at-13.51.57-1024x516.jpeg)