జల సాధన సమితి వినతి కి లోకేష్ హామీ

జల సాధన సమితి వినతి కి లోకేష్ హామీ ఇచ్చాపురంలో లోకేష్ ను వంశధార జల సాధన సమితి ప్రతినిధులు కలిశారు.వంశధార, బహుదా నదుల అనుసంధానం ద్వారా రెండు లక్షల పదహారు వేల ఎకరాల ఆయకట్టు కి సాగునీరు అందించే బృహత్తర…

కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో వైద్య కళాశాల, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొడంగల్‌లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. ముఖ్యమంత్రి…

మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

ఆత్మకూరు : వివాహం కావడం లేదని మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విషపు గుళికలు మింగి బలవన్మరణం చెందిన ఘటన ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామంలో ఆదివారం చోటు  చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.., ప్రభాకరరెడ్డి (28) బెంగళూరులోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం…

ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు. ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్‌, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌. పెండింగ్‌ డీఏలతో పాటు…

భేటీకానున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

అమరావతి: నేడు పార్టీ నేతలతో భేటీకానున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఈ నెల 14వ తేదీ నుంచి గోదావరి జిల్లాల్లో పవన్‌ కల్యాణ్‌ పర్యటనలు

నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు

ఇవాళ ఉదయం నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు.. వై వీ సుబ్బారెడ్డి..గొల్ల బాబురావు.. మేడ రఘునాథరెడ్డి.. నామినేషన్ కార్యక్రమనికి హాజరు కానున్న పలువురు ఎమ్మెల్యేలు..

ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు

హైదరాబాద్‌: తెలంగాణ ఆబ్కారీశాఖలో ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు. కొన్ని కేసులైతే 1995 నుంచి అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలా ఏకంగా 18 వేల కేసులు దర్యాప్తు దశ దాటకపోవడం విడ్డూరం. గుడుంబా, నకిలీ మద్యం నుంచి మాదకద్రవ్యాల…

కింది స్థాయి సిబ్బంది బదిలీలు ఇప్పట్లో జరుగుతాయా, లేవా

హైదరాబాద్‌: పోలీసు శాఖలో కింది స్థాయి సిబ్బంది బదిలీలు ఇప్పట్లో జరుగుతాయా, లేవా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వారంతా గత భారాస ప్రభుత్వ హయాంలో బాధ్యతలు చేపట్టిన వారే కావడంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రతినిధులు…

జైల్లో మగ్గుతున్న నేవీ మాజీ అధికారులకు స్వేచ్ఛ

భారత్‌కు దౌత్య విజయం.. ఖతర్‌ జైల్లో మగ్గుతున్న నేవీ మాజీ అధికారులకు స్వేచ్ఛ ఖతర్‌లో గూఢచర్యం ఆరోపణలపై 2022లో 8 మంది భారత నేవీ మాజీ అధికారుల అరెస్టు 2023లో నిందితులకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు భారత…

తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ..

నేడు తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ.. నేడు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం…

శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక

🌎 చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 12 🔎 సంఘటనలు🔍 🌾1961: శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడింది. 🌾2011 – 2011 ఫిబ్రవరి 22 స్వామి దయానంద సరస్వతి జయంతి (రోమన్ కాలమానం ప్రకారం 1824 ఫిబ్రవరి 12…

జగన్ రెడ్డి అర్జునుడు కాదుపరిపాలన చేతకాని అధముడు

జగన్ రెడ్డి అర్జునుడు కాదుపరిపాలన చేతకాని అధముడు వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎన్ని యాత్రలు తీసినా…తీర్థయాత్రలు చేసినా వైసీపీకి అంతిమయాత్ర తప్పదు గుంటూరు నగర జనసేన అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదే…

రేపు రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’

రేపు రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’ భారీ భద్రతతో దుర్భేద్యంగా ఢిల్లీ, హరియాణా సరిహద్దులు ఢిల్లీ/చండీగఢ్‌: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన ‘ఢిల్లీ చలో’మార్చ్‌ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు..…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 12-ఫిబ్రవరి-2024సోమవారం 🕉️ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ 🕉️ నిన్న 11-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,256 మంది… 🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 28,021 మంది… 🕉️…

అండర్‌-19 వరల్డ్‌కప్‌ విజేత ఆస్ట్రేలియా

అండర్‌-19 వరల్డ్‌కప్‌ విజేత ఆస్ట్రేలియా ఫైనల్‌లో భారత్‌పై 79 పరుగుల తేడాతో ఆసీస్‌ గెలుపు ఆస్ట్రేలియా స్కోర్ 253/7, భారత్ స్కోర్ 174 ఆలౌట్

రేవంత్‌రెడ్డిని జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్ కలిశారు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్ కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు భేటీలో…

రహదారుల అనుసంధానతను పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది

హైదరాబాద్‌: ప్రగతి సూచికలైన రహదారుల అనుసంధానతను పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌ అండ్‌ బీ శాఖకు రూ.14,305 కోట్లు కేటాయించారు. ఇందులో తొలి 3 నెలలకు రూ.4,768 కోట్ల కేటాయింపులు చేశారు. మండల…

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలను అనుమతించారు

యాదగిరిగుట్ట: దాదాపు రెండేళ్ల తర్వాత యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలను అనుమతించారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి జిల్లా కలెక్టర్‌, డీసీపీ, ఆలయ ఈవోను ఆటో ఎక్కించుకొని…

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ సర్వే నెంబర్ 334 లో వెలుస్తున్న ఆక్రమణలు

కత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ 334 లో వెలుస్తున్న ఆక్రమణలు ఆశ్చర్యం ఏంటి అంటే ఇక్కడ బడా నాయకుల భూమి ఒక పక్క రెండో పక్కన జర్నలిస్ట్ కి సంబందించిన భూములు ఇక్కడ గతంలో పట్టాలు…

గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.. శతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వికర్‌ జనరల్‌ మోన్సిన్యోర్‌ మువ్వల…

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రి పూట సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ల, కండక్టర్లకు నైట్ ఔట్ భత్యాలను జీతంలో కలిపి చెల్లించనుంది. దీంతో ఈ నైట్ ఔట్ భత్యాలను, జీతంతో పాటూ అకౌంట్లో జమ కానుంది.…

R&B కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోలేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కాంట్రాక్టర్లు ఫిబ్రవరి 9లోపు బిల్లులు చెల్లించాలని, లేనట్లయితే ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కోర్టుకు రావాలని ఆదేశాలు బిల్లులు చెల్లించకుండా రావత్ కోర్టుకు రాకపోవడం పై కోర్టు ఆగ్రహం…

HMDA మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు.

కేసులో కీలకంగా మారిన కస్టడీ కన్ఫేషన్‌ స్టేట్‌మెంట్‌. కస్టడీ కన్ఫేషన్‌లో ఒక ఐఏఎస్‌ అధికారి పేరు ప్రస్తావన. పలువురి ఒత్తిడి మేరకు అక్రమాలు, ఆస్తులు అంటూ శివ బాలకృష్ణ స్టేట్‌మెంట్. బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన ఏసీబీ.…

జగన్ ఎన్నికల ప్రచారం… పోగ్రామ్స్ షేడ్యుల్ షురూ..

ఫిబ్రవరి 16 కుప్పం వైయస్సార్ చేయూత చివరి దశ విడుదల కార్యక్రమం. ఫిబ్రవరి 18 సిద్ధం ముగింపు సభ సమావేశం మరియు మేనిఫెస్టో విడుదల. ఫిబ్రవరి 21 అన్నమయ్య రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల. ఫిబ్రవరి 24 కర్నూలు వైయస్సార్ ఈ…

పీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు: భారాస ఎంపీ కేకే

పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని పలుసార్లు కోరాం: భారాస ఎంపీ కేకేపీవీకి భారతరత్న ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలుపీవీకి భారతరత్న ఇవ్వడాన్ని దేశ ప్రజలంతా హర్షిస్తున్నారు

తెలంగాణ ఉద్యమంలో అందరం టీజీ అని రాసుకునేవాళ్లం: సీఎం రేవంత్‌రెడ్డి

కేంద్రం కూడా తమ నోటిఫికేషన్‌లో టీజీ అని పేర్కొన్నది అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫరించేలా టీఎస్‌ అని పెట్టింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేం రాష్ర్ట అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించాం రాష్ర్ట అధికారిక…

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: సీఐడీ చార్జిషీట్ ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిన్న చార్జిషీట్ వేసిన సీఐడి నేటి విచారణలో సీఐడీకి చుక్కెదురు చార్జిషీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం అనుమతి ఉండాలన్న కోర్టు శివ శంకర్. చలువాది ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ అధినేత…

శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం

భక్తులకు పంపిణీ చేసిన పులిహార ప్రసాదంలో మాంసపు ముక్క. బ్రహ్మానందరాయ గోపురం దగ్గర ప్రసాదాల పంపిణీలో ఘటన. పులిహారలో మాంసపు ముక్కను గుర్తించిన భక్తుడు హరీష్ రెడ్డి. దేవస్థానం అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసిన భక్తుడు. అధికారుల పర్యవేక్షణ లోపం పై…

చిరంజీవికి అభినందనలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసిన చిరంజీవి దంపతులు ఈ సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలిపిన గవర్నర్‌ చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపికైన విషయం తెలిసిందే

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా.? జాగ్రత్త..ఇదొక ఆన్లైన్ మోసం?

వర్క్‌ ఫ్రం హోమ్‌ పేరుతో ఓ యువతిని సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నకిలీ వెబ్‌సైట్ లింక్‌ పంపి సుమారు రూ. లక్ష వరకు కాజేశారు. ఖమ్మం జిల్లా…ఇల్లెందు మండలంలోని నిజాంపేటకు చెందిన పత్తి నవ్యశ్రీ అనే యువతి…

You cannot copy content of this page