కమలాపూర్ లో ఘనంగా ఆటో కార్మికుల దినోత్సవం
కమలాపూర్ :
కమలాపూర్ మండల కేంద్రం లో జై హనుమాన్ ఆటో యూనియన్ ఆధ్వర్యం లో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటో డ్రైవర్ లు ఆటో లతో భారీ గా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా జై హనుమాన్ ఆటో యూనియన్ అధ్యక్షులు కూనూరి రవి మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్ పథకం వచ్చినప్పటి నుండి ఆటోలలో ఎవరు ప్రయాణం చేయకపోవడం వల్ల ఆటో డ్రైవర్ ల బతుకులు రోడ్డున పడ్డాయని అన్నారు.ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఆటో డ్రైవర్ లకు ఇచ్చిన హామీని అమలు చెయ్యాలని అన్నారుబ్. అలాగే ఆటో డ్రైవర్ లను ఆడుకుంటామని చెప్పినా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చెయ్యలేదని,ఆటోలు నడుపుకుని జీవనం కొనసాగించే డ్రైవర్ ల బతుకులు చాలా దీన స్థితి లో ఉన్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో డ్రైవర్ లకు ప్రతీ నెలా పది వేల రూపాయలు డ్రైవర్ ల అకౌంట్ లల్లో వేయాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆటో కార్మికుల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేస్తామని జై హనుమాన్ ఆటో యూనియన్ అధ్యక్షులు కూనూరి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు మౌటం లింగమూర్తి, ప్రధాన కార్యదర్శి ధర్ముల తిరుపతి, కోశాధికారి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
కమలాపూర్ లో ఘనంగా ఆటో కార్మికుల దినోత్సవం
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
TEJA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
TEJA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…