తాండూరు: రానున్న లోక్సభ ఎన్నికల్లో భాజపా 370 సీట్లు సాధిస్తుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తాండూరులో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పార్టీని గెలిపించాలన్నారు. ‘‘భాజపా వెనుక రాముడు లాంటి ప్రధాని మోదీ ఉన్నారు. భారాసతో పొత్తు ఉంటుందని భాజపాపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. అది ఎప్పటికీ జరగదు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు భాజపాను 370 స్థానాల్లో గెలిపించాలి’’ అని బండి సంజయ్ కోరారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-20-at-4.15.07-PM-1024x835.jpeg)