నీలం మదన్నకు బ్రహ్మరథం..

నీలం మదన్నకు బ్రహ్మరథం..

TEJA NEWS

దారి పొడవునా నీరాజనం..*
ఘన స్వాగతం పలికిన మండల నేతలు, నాయకులు
బొమ్మారం నుంచి వెల్దుర్తి వరకు ప్రచారం..
మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి నీలం మదన్నకు వెల్దుర్తి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఆయనకు నీరాజనం పలికారు. బొమ్మారం, కోప్పులపల్లి, నెల్లూరు నుంచి వెల్దుర్తి వరకు నీలం మధు ప్రచార రథంతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మండల నాయకులు, ముఖ్యులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రచార రథం నుంచి నీలం మధు అభివాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మెదక్ డిసిసి అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, నర్సాపూర్ మహిళ ఇన్చార్జి సుజాత సత్యం, సుహాసినిలు నీలం మధుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, ఎంపీపీ నరేందర్ రెడ్డి, సర్పంచ్ భాగ్యలక్ష్మి ఆంజనేయులు, మాజీ మండలాధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర మత్స్యశాఖ లీడర్ నరసింహారెడ్డి, యూత్ లీడర్ మల్లేష్ చారి తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS