వరుసగా మూడోసారి వారణాసి నుంచి నామినేట్ అయినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. గత 10 సంవత్సరాలలో నేను ప్రతి ఒక్కరి నుండి అద్భుతమైన ఆప్యాయత మరియు ఆశీర్వాదాలను పొందాను, వారు నిరంతర సేవ మరియు సంకల్పంతో పనిచేయడానికి నన్ను ప్రేరేపించారు. మీ ఉదారమైన మద్దతు మరియు భాగస్వామ్యంతో, నేను నా మూడవ టర్మ్లో కొత్త శక్తితో ఇక్కడి ప్రజల సర్వతోముఖాభివృద్ధి మరియు సంక్షేమం కోసం కృషి చేస్తాను.
Category: NATIONAL
NATIONAL
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చిన కోర్టు.
ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఢిల్లీతో జరగనున్న మ్యాచ్లో సెంచరీ సాధిస్తే.. ప్రొఫెషనల్ క్రికెట్లో వంద సెంచరీల మార్కును చేరుకోనున్నారు. ప్రస్తుతం విరాట్ ఫస్ట్ క్లాస్లో 36 సెంచరీలు, లిస్ట్-ఏలో 54 సెంచరీలు, టీ20ల్లో 9 సెంచరీలు చేసి మొత్తం 99 శతకాల వద్ద ఉన్నారు. గత మ్యాచ్లో ఆయన 8 పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీలోని బురారీ ఆసుపత్రి, సంజయ్ గాంధీ ఆసుపత్రికి ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఈ ఆసుపత్రులకు చేరుకున్నాయి. ఈ మిషన్పై ఆసుపత్రి సిబ్బంది మరియు రోగులను పంపారు మరియు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించారు. మెయిల్ ద్వారా తమకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఆస్పత్రి అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇటీవల జైపూర్, గోవా, నాగ్పూర్లోని విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గత కొద్ది…
బెయిల్పై బయటకొచ్చి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింజ్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. బీజేపీ ‘మోదీ కీ గ్యారంటీ’ తరహాలోనే ‘కేజ్రీవాల్ కీ గ్యారంటీ’ పేరిట 10 హామీలను ఆయన ఆదివారం ప్రకటించారు. ఇందులో చైనా ఆక్రమణలో ఉన్న భారత భూమి విముక్తితో సహా పలు ఉచిత పథకాలను ప్రకటించారు. వీటిలో 24 గంటల ఉచిత కరెంట్, ఉచిత వైద్యం వంటివి ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర…
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’భారత్లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్రైవేట్ డిజిటల్ వాలెట్ను లాంఛ్ చేసింది. ఇందులో క్రెడిట్, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్లు, పాస్లు, ఐడీలు వంటివి సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. లావాదేవీలయేతర అవసరాల కోసమే ఈ వ్యాలెట్ను రూపొందించామని గూగుల్ తెలిపింది. మెట్రో ట్రైన్ టికెట్లు కూడా సేవ్ చేసుకునే విధంగా మెట్రో యాజమాన్యాలతో సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం
ఎన్నికల కోసం 56 ఏళ్లకు పెళ్లి చేసుకున్న వ్యక్తి!తాజాగా బీహార్లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర నేరాలకు పాల్పడి సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించిన అశోక్ మహతో (56) ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను సంప్రదించారు. పెళ్లి చేసుకుంటే భార్యకు టికెట్ ఇస్తామని లాలూ సూచించారు. అతను 56 ఏళ్ల వయసులో 46 ఏళ్ల అనితను వివాహం చేసుకున్నాడు. మాట ప్రకారం…
ఉచిత రేషన్తో ప్రజల బతుకులు బాగుపడవు: ప్రియాంక గాంధీఐదు కిలోల ఉచిత రేషన్తో ప్రజల బతుకులు బాగుపడవని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. యూపీలోని రాయ్బరేలిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఉపాధి లభిస్తేనే మీరు స్వయంగా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పారు. మీరు ఒకరిపై ఆధారపడేలా విధానాలు రూపొందిస్తున్న రాజకీయ పార్టీ గురించి అర్ధం చేసుకోవాలని అన్నారు.