చేవెళ్ల అసెంబ్లీ బీజేవైఎం కో కన్వీనర్ గా చేకూర్త రాజశేఖర్ రెడ్డి

చేవెళ్ల అసెంబ్లీ బీజేవైఎం కో కన్వీనర్ గా చేకూర్త రాజశేఖర్ రెడ్డి

TEJA NEWS

చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ బీజేవైఎం కో కన్వీనర్ గా శంకర్‌పల్లి మండల మహాలింగాపురం గ్రామానికి చెందిన చేకూర్త రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు చేవెళ్ల అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ అల్లాడ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేకూర్త రాజశేఖర్ రెడ్డికి నియామక పత్రం అందజేశారు. ఆయనతో పాటు చేవెళ్ల బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శిగా మల్గారి మధుకర్ రెడ్డి, చేవెళ్ల పట్టణ బిజెపి అధ్యక్షులుగా చంద్రశేఖర్ రెడ్డి లను నియమించారు. ఈ సందర్భంగా చేకూర్త రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి, ఈ పదవిని అప్పజెప్పిన ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, మండల, మున్సిపల్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కేశవరెడ్డి, ఆలంఖాన్ గూడ గ్రామ బీజేవైఎం అధ్యక్షుడు నవీన్ కుమార్ పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS