సీఎం రేవంత్ రెడ్డికి ఓ లెక్కుంది

సీఎం రేవంత్ రెడ్డికి ఓ లెక్కుంది

TEJA NEWS

సీఎం రేవంత్ రెడ్డికి ఓ లెక్కుంది

హైదరాబాద్:జనవరి 02
ఓ వైపు అప్పులు, మరోవైపు సంక్షేమం రూపంలో భారీ వ్యయాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాళ్లు ఇవే. కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడా సవాళ్లను అధిగమించి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి ఉంటుంది.

అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో రేవంత్ రెడ్డి ఇప్పుడు పులిమీద స్వారీ చేస్తు న్నారు. అయితే ఆయనకు అనేక అవకాశాలు దారులు చూపుతున్నాయి.

దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించి 10 ఏళ్ల ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం దేశం దృష్టిని ఆకర్షించిందని చెప్పేందుకు ఎలాంటి సందేహం అవసరం లేదు. అదే సమయంలో భారీగా పెరిగిన అప్పులు భవిష్యత్తుకు సవాళ్లు విసురుతున్నాయి.

అధికార, ప్రతిపక్ష పార్టీలు విడుదల చేసిన శ్వేత, స్వేద పత్రాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజల్లో విస్తృ తంగా చర్చ జరుగు తోంది. ఎన్నికల హామీలను ఆచర ణలో పెడితే ప్రజలు కోరుకు న్న మార్పు, అందరూ ఆకాం క్షిస్తున్న అభివృద్ధి సాధ్యమ వుతుంది.

ఆ దేశాలే స్ఫూర్తి
తెలంగాణ రాష్ట్రంలో వనరులకి కొదవలేదు. పురోగతిలో ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కావాల్సిందల్లా స్పష్టమైన, ఆచరణీయమైన విధానాలు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాలు, దేశాలు ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొని.. ఎదురీది నేడు ప్రపంచం ముంగిట సగౌరవంగా నిల్చున్నాయి.

ప్రభుత్వం, ప్రజల మధ్య అనుసంధానానికి టెక్నాలజీనే వేదికగా చేసుకొని.. ఇతర దేశాలకు మోడల్‌గా గుర్తింపు పొందింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. దక్షిణ కొరియా, సింగపూర్, ఎస్తోనియా అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసి ఇక్కడా ఆచరిస్తే మెరుగైన ఫలితా లు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఉద్యోగాలు.. ఉపాధి చూపాలి

నీళ్లు.. నిధులు.. నియామ కాల నినాదంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పిదాలు .. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పునరావృతం చేయకూడ దు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ హామీపై నిలబెట్టు కోవాలి. యువత దీనిపై భారీ ఆశలు పెట్టుకుంది.

టీఎస్పీఎస్సీ తీరుతో విసిగిపోయిన ఉద్యోగా ర్థులు.. ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానా లను నిశితంగా గమనిస్తు న్నారు. ఈ పరిస్థితుల్లో.. జాబ్ క్యాలెండర్, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీలు, పీజీలు చేసిన ప్రతి ఒక్కరికీ సర్కారీ ఉద్యోగాలు ఇవ్వడం ఏ ప్రభుత్వం వల్ల కూడా సాధ్యం కాదన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఈ విషయంలో ప్రత్యామ్నా యంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చు కోవాలి.

వ్యవసాయంలో సమృద్ధి దిశలో పయనిస్తోన్న మన రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అద్భుతాలు సృష్టించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐటీ, తయారీ, సేవల రంగాల్లో విస్తృత అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సంస్థలు కోరుకుంటు న్నట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దితే నిరుద్యోగిత అనే సవాల్‌ని సులువుగా అధిగమించవచ్చు.

పాలన వికేంద్రీకరణ జరగాలి

పురోగతి మొత్తం ఒకే దగ్గర కేంద్రీకృతమైతే.. ప్రజల సామాజిక- ఆర్థిక అంశాల్లో తేడాలు ఉత్పన్నం అవుతా యి. రాష్ట్రంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగా ణ మొత్తం తీర్పు ఒకలా ఉంటే.. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల తీర్పు మరోలా ఉంది. అందుకే.. రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాన స్థాయిలో అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలి.

ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ, సేవల రంగాలను జిల్లా కేంద్రాలకు విస్తరిం చాలి. పరిశ్రమలను వికేం ద్రీకరించాలి. ఉద్యోగాల కోసం ప్రతి ఒక్కరు హైదరా బాద్‌కు రానవసరం లేకుం డా వారి ప్రాంతాల్లోనే మంచి అవకాశాలు దక్కేలా వ్యవస్థ లను స్థాపించాలి.

విద్య, వైద్యంపై చేసే వ్యయాన్ని ఖర్చుగా చూడొద్దు. ఈ రంగాల్లో పెట్టే ప్రతి రూపాయి ప్రతిఫలంగా రెండు, మూడు రెట్ల ఆర్థిక ప్రగతి సాధించి పెడుతుంది. ప్రభుత్వ విద్య, వైద్యాన్ని ఎంత బలోపేతం చేస్తే రాష్ట్రం అంత ప్రగతి సాధిస్తుంది. నగదు పంపిణీ పథకాల కన్నా.. ప్రభుత్వ విద్య, వైద్యం, రవాణా సదుపాయాలను మెరుగ్గా అందిస్తే చాలనే వాదన ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తోంది.

ఓ వైపు ఇచ్చిన హామీలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడం, కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడం రేవంత్ సర్కార్‌కి కత్తిమీద సాము లాంటిదే. రూ. 2 లక్షల రుణమాఫీ, మహిళలకు నెలకి రూ. 2500, రూ. 4వేల చేయూత పింఛన్లు, రైతు భరోసా కింద రూ. 15 వేలు, కౌలు రైతులకి రూ. 12 వేలు, రూ. 500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాల అమలుకే అధిక మొత్తంలో నిధులు అవసరం అవుతా యి. అయితే రాష్ట్ర ఆదా యం పెంచి, సంక్షేమ పథకా లు అమలు చేస్తామని కాంగ్రె స్ చెబుతోంది. వ్యవసా యం, ఉత్పత్తి, సేవల రంగాలని బలోపేతం చేసి ఎగుమతులు పెంచుకో వాలి. తద్వారా రాష్ట్ర రాబడి పెరుగుతుంది.

పాలకుడిగా.. నాయకుడిగా

దేశంలో పలు రాష్ట్రాల్లో గతంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా.. కాంగ్రెస్ సర్కార్ వచ్చే 5 ఏళ్లు ఐక్యంగా ఉండి, సమష్టిగా పనిచేస్తుందనే నమ్మకాన్ని రాష్ట్ర ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత నాయకుడిగా రేవంత్ భుజాలపైనే ఉంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS