
నిరుపేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
రెండు లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి అందజేత
పటాన్చెరు : ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ జయలక్ష్మి నగర్ కాలనీకి చెందిన కె. పున్నయ్యగత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్య కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు వైద్యం కోసం మంజూరైన రెండు లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి అనుమతి పత్రాన్ని ఎంఎల్ఏ జిఎంఆర్ చేతుల మీదుగా పున్నయ్య కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జగన్, తదితరులు పాల్గొన్నారు.
