కాంగ్రెస్‌ నేతలు నేడు ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించనున్నారు

కాంగ్రెస్‌ నేతలు నేడు ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించనున్నారు

TEJA NEWS

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి నేతృత్వంలో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ మినహా.. మిగిలిన సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు.

వీరితోపాటు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, ఇతర ముఖ్యనాయకులు కూడా వెళ్తారు.

మొదట కర్వెన ప్రాజెక్టును సందర్శిస్తారు. తర్వాత ఉదండాపూర్‌, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుల వద్దకు వెళ్తారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS