కాంగ్రెస్ గెలుపును ఆపలేరు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

కాంగ్రెస్ గెలుపును ఆపలేరు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

TEJA NEWS

వామపక్షాలు బలపర్చిన కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ను గెలిపించాలని కోరుతూ నేడు సీపీఐ ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్ నుండి జగతగిరిగుట్ట వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ ర్యాలీ కి ముఖ్యఅతిథిగా సీపీఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ లు హాజరై మాట్లాడుతూ బీజేపీ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్,డీజిల్ గ్యాస్ ధరలు పెరిగిపోయాయని,దళితులు, మహిళల పై అత్యాచారాలు , నిరుద్యోగం,విద్వేష పెరిగిపోయాయని వీటి గురించి మాట్లాడకుండా ప్రజలను మతం,దేవుడు పేరిట మభ్యపెట్టడానికి చూస్తున్నారని, కానీ ప్రజలు అన్ని తెలుస్కున్నారని కావున బీజేపీ ఓడిపోవడం ఖాయమన్నారు. మోడీ ఒడిపోతానని తెలిసి ఇష్టం వచ్చినట్లు ముస్లిం,పాకిస్తాన్ అంటూ 70 సంవత్సరాలలో ఏ ప్రధాని చెప్పని అబద్దాలు మోడీ చెప్పారని కావున ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టులు ఈ సారి కాంగ్రెస్ కు మద్దతు తెలిపాయని కావున మేధావులు, కార్మికులు, రైతులు, ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు హరినాథ్, స్వామి,ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్,మునిసిపల్ అధ్యక్షుడు రాములు,సదానంద్ శాఖ కార్యదర్శులు వెంకటేష్, సాయిలు,సహాదేవరెడ్డి,శేఖర్ సుధాకర్,మహిళ సంఘం అధ్యక్షురాలు హైమవతి, ఇమామ్,నర్సింహ,రాజు,,చారి,చంద్రమ్మ,సుజాత,కలమ్మ,భాగ్యమ్మ,సుమారు 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS