Dead bodies of 45 Indians reached Kerala
కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు
కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో అధికారులు కేరళకు తీసుకొచ్చారు. ఈ నెల 12న కువైట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి ఇప్పటికే నివాళులర్పించారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-15-at-14.12.46.jpeg)