చంద్రబాబు నాయుడు తోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

చంద్రబాబు నాయుడు తోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

TEJA NEWS

ఉయ్యూరు 7.6.2024

చంద్రబాబు నాయుడు గారి తోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యం – తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్.

ఉండవల్లిలోని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో ఆయన్ను కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా మరియు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన రాజేంద్రప్రసాద్ గారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ…

చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంత పెద్ద మెజార్టీలతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించారని, గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ ని మరల అభివృద్ధి బాటలో నడిపించాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవ్వుద్దని ప్రజలు బలంగా నమ్మారని, మా అందరి అభిమాన నాయకుడైన శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సిద్ధాంతాల కోసం మేమందరం పనిచేస్తామని రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజులపాటి ఫణి, టీఎన్ఎస్ఎఫ్ లీడర్ జంపాన తేజ,షఫీ, బాలకృష్ణ, శోభన్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS