TEJA NEWS

జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్

గద్వాల: జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ పాలక వర్గం పదవి కాలం పూర్తి కావడంతో కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మరియు జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ రావు , కలెక్టర్ కు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఛాంబర్ లో ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నర్సింగ రావు సంతకాలు చేయించి బాధ్యతలు అప్పగించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ సిబ్బందితో పరిచయం చేసుకొని సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకొని సిబ్బందికి పలు సూచనలు చేశారు.


TEJA NEWS