బెస్ట్ అవలేబుల్ స్కూల్ లో దళిత విద్యార్థులకు

బెస్ట్ అవలేబుల్ స్కూల్ లో దళిత విద్యార్థులకు

TEJA NEWS

బెస్ట్ అవలేబుల్ స్కూల్ లో దళిత విద్యార్థులకు లక్కీ డ్రాలో వచ్చిన విద్యార్థులకు జీవో ప్రకారం రావాల్సిన మెటీరియల్ వెంటనే ఇవ్వాలి
సిద్దిపేట్ జిల్లా

గతంలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి
విద్యా హక్కు చట్ట ప్రకారం 25% విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థల అవకాశం కల్పించాలి
లక్కీ డ్రా లో పెట్టిన వికాస్ స్కూల్ అడ్మిషన్ ఇవ్వాలి ఇవ్వకుంటే సంబంధిత అధికారులు స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య (బి డి ఎస్ ఎఫ్) కార్యాలయంలో దళిత సంఘాలు విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు
జంజీరపు ఎల్లేష్ జనసేన సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి పవన్ మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో లక్కీ డ్రా లో వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు జీవో ప్రకారం రావాల్సిన మెటీరియల్ బుక్స్ ,టై ,బెల్ట్ , డైరీ మెటీరియల్స్ దూర ప్రాంతాల వారికి బస్సు సౌకర్యం కల్పించాలి లేదా హాస్టల్ వసతి కల్పించాలి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పాత బిల్లులు వెంటనే విడుదల చేయాలి ప్రభుత్వం చొరవ చూపి దళిత విద్యార్థులకు న్యాయం చేయాలని అదేవిధంగా వికాస్ హై స్కూల్ లక్కీ డ్రా లో వచ్చిన విద్యార్థులను తీసుకోవాలి లేనిపక్షంలో వికాస్ స్కూల్ గుర్తింపు రద్దు చేయాలి
ఈ స్కీమ్ లో అన్ని ప్రైవేట్ స్కూల్స్ అన్నిటిని భాగస్వామ్యం చేయాలి
వచ్చే సంవత్సరం ఈ స్కీం లో సీట్ల పరిమితి పెంచాలి అని కోరారు ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఎం ఎస్ పి జిల్లా సిద్దిపేట అధ్యక్షులు పెర్క పరశురాములు బిడిఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దెబ్బట ఆనంద్ బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సడిమెల డేవిడ్ బి ఎఫ్ టి యు శివరాత్రి శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి