
ప్రజా సమస్యల పరిష్కారమే గ్రీవెన్స్ డే
బుచ్చి చైర్పర్సన్ మోర్ల సుప్రజ
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ ఈ కార్యక్రమంలో ఆమెమాట్లాడుతూ.. ఈ గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజల నుంచి , డ్రైనేజీ, రోడ్లు, త్రాగునీరు, జంగిల్ క్లియరెన్స్, కి సంబంధించిన అర్జీలను స్వీకరించడం జరిగిందని, తెలియజేశారు.
నా దృష్టికి సమస్య వచ్చిన వెంటనే అధికారులను పురమాయించి వీలైనంత త్వరగా పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని తెలియజేశారు.పట్టణంలో ఏ సమస్య ఉన్న నా దృష్టికి తేవాలని నావల్ల కానీ పక్షంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ గ్రీవెన్స్ డే ను ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇనమల చినబాబు, పాల్గొన్నారు