
సీఎం చంద్రబాబును గుండెల్లో పెట్టుకొని పూజిస్తాను: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
అట్లాంటా స్టేట్ ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో… ఘనంగా సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు
ముఖ్యఅతిథిగా పాల్గొని…కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాము
పనికిమాలిన వ్యక్తులను టార్గెట్ చేయడానికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వడం లేదు….
ప్రజల మంచి కోసం కష్టపడి పనిచేయడమే చంద్రబాబు బలం….
ప్రవాసాంధ్రులు చంద్రబాబు పి.4లో భాగస్వాములు కావాలి…
కమ్మింగ్ ఎన్టిఆర్ స్టాట్యూ 2450 మౌంటైన్ రోడ్ లో ఆదివారం సాయంత్రం….జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు
వేడుకల్లో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే రాము….
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కామెంట్స్
సీఎం చంద్రబాబు పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ప్రాముఖ్యమైన రోజు.
గత ఏడాది పర్యటనలో మంత్రి నారా లోకేష్ తో కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చోటే…. చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ అవసరాలను తీర్చడానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందు నిలబడుతూ…
రాష్ట్ర తలరాతను మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న మహోన్నత వ్యక్తి సీఎం చంద్రబాబు.
ఖండాంతరాలు దాటి పుట్టినరోజు వేడుకలు జరుగుతుండడమే… చంద్రబాబు గొప్పతనానికి నిదర్శనం.
సమకాలీన రాజకీయాల్లో చంద్రబాబుకు సాటి వచ్చే వ్యక్తి దేశంలో మోడీ తప్ప మరొకరు ఉండరు.
తెలుగు ప్రజలందరూ రుణపడి ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు.
మోడ్రన్ హైదరాబాద్ ను ఎలా అభివృద్ధి చేశారో….
ప్రపంచ స్థాయిలో అమరావతి లాంటి గొప్ప నగర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళుతున్నారు….
మనం చేసే పనులు భవిష్యత్తు తరాలకు ఎలా ఉపయోగపడతాయో అని నిరంతరం ఆలోచిస్తున్నారు.
ఇంకా కొందరిని జై లకు పంపడం లేదేంటి అని మనం ఆలోచిస్తున్నాం.
ప్రజలకు ఏం మంచి చేయాలో అనే చంద్రబాబు నిరంతరం ఆలోచిస్తారు….
చట్ట ప్రకారంగానే వ్యవహరించాలనేదే చంద్రబాబు ఆలోచన….
ఐదేళ్లపాటు పనికిరాని వ్యక్తులు చంద్రబాబు గురించి నీచంగా మాట్లాడారు…
నేడు అధికారం ఉంది కదా అని వాళ్ళని టార్గెట్ చేయకుండా….ప్రజల కోసం కష్టపడుతున్నారు.
గత ప్రభుత్వం చేసిన తనకు చేసిన అన్యాయాలను దిగమింగి….
రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం ఇలా ప్రజలకు ఏం కావాలో వాటి కోసమే ఆయన కష్టపడుతున్నారు.
ప్రజల మంచి కోసం కష్టపడి పనిచేయడమే చంద్రబాబు బలం.
ఎన్టీఆర్ తనకు ఆరాధ్యదైవం అయితే…. చంద్రబాబును గుండెల్లో పెట్టుకొని పూజిస్తాను.
ప్రపంచంలో ఉన్న తెలుగువారి అభివృద్ధిని చూసి… చంద్రబాబు ఎంతో గర్వంగా చెబుతారు.
చంద్రబాబు 2047 విజన్ లో మనందరం భాగస్వామ్యం అవుదాం.
చంద్రబాబు ఆలోచనలే… రేపటి భావితరాల అభ్యున్నతికి వారదులుగా మారుతున్నాయి.
చంద్రబాబు విజన్ నుండి పుట్టుకొచ్చిన ఆలోచనలు నేడు దేశం మొత్తం అమలు చేస్తున్నారు.
చంద్రబాబు వందేళ్లపాటు ఇదే ఉత్సాహంతో పనిచేసి.. తెలుగు వారందరిని ముందుకు తీసుకెళ్లాలి.
ఎన్నారైల మనసులు తెలిసిన వ్యక్తిగా… చెప్తున్న…మీ ప్రాంతాల్లో ఏ మంచి పని చేయాలన్న నేను మీకు పూర్తిగా సహకరిస్తాను.
మీరు చేయాలనుకున్న మంచి పనులు నావిగా భావించి…వాటిని ముందుకు తీసుకెళతాను.
ప్రవాసాంధ్రులు చంద్రబాబు పి.4లో భాగస్వాములు కావాలి.
మీకు ఆసక్తి ఉన్న ఏ అంశంలోనైనా భాగస్వామ్యం అవ్వండి…ప్రజల మంచి కోసం చంద్రబాబుతో కలిసి పని చేయండి.
