హనుమత్ ప్రత్యంగిరా కృత్యాతంత్రం పుస్తక ఆవిష్కరణ

హనుమత్ ప్రత్యంగిరా కృత్యాతంత్రం పుస్తక ఆవిష్కరణ

TEJA NEWS

హనుమత్ ప్రత్యంగిరా కృత్యాతంత్రం పుస్తక ఆవిష్కరణ

ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద …

ఈరోజు 130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలని శ్రీ సంతోష్ నగర్ లోని శ్రీ నిఖిల సాయి మైత్రేయ మధుసూదన సరస్వతి పీఠంలో శ్రీ నిఖిలేశ్వరానంద స్వామిజి (డా॥ నారాయణ దత్త శ్రీమాల్) స్వామి వారి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా పూజ్యు గురుదేవులు కీ॥ శే॥ శ్రీ స్వామి మధుసూదన సరస్వతి వారి కలం రచనలు శ్రీ నిఖిల తంత్రాలులో బాగంగా శ్రీ గురుదేవుల అనుగ్రహ ఆశీస్సులతో సుబ్రహ్మణ్యం స్వామి చే నూతనంగా రచించబడిన శ్రీ హనుమత్ ప్రత్యంగిరా కృత్యాతంత్రం పుస్తకాన్ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిఖిల సాయి మైత్రేయ మధుసూదన సరస్వతి పీఠం చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను అభినందిస్తూ పీఠం నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ రాక్షస సంహారం చేయడానికి ఆదిపరాశక్తి అవతారాలే ప్రత్యంగిరా అవతారాలని, ఇందులో భాగంగా హనుమత్ ప్రత్యంగిరా కృత్యాతంత్రం పుస్తక ఆవిష్కరణ చేసుకోవడం జరిగిందని అన్నారు. అనంతరం స్థానికంగా చేపడుతున్నటువంటి సీసీ రోడ్డు పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, నిజాం పేట్ కార్పొరేటర్ ఆగం రాజు, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీ నారాయణ, పందిరి యాదగిరి, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ముఖ్య సలహాదారుడు, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ సర్వేపల్లి, కార్యవర్గ సభ్యులు గడ్డం రాంబాబు, శ్రీధరాచార్యులు, హరి రాఘవేంద్ర, మాలతి శ్రీనివాస్, సూర్య సుందరి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి