అయోధ్యలో వందల ఏళ్ల నాటి అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది

అయోధ్యలో వందల ఏళ్ల నాటి అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది

TEJA NEWS

అయోధ్యలో వందల ఏళ్ల నాటి అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది…

రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది..

12:29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట

84 సెకండ్ల పాటు సాగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం

నవ నిర్మిత రామ మందిరంలో నీల మేఘ శ్యాముడి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది…

ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆ మహోన్నత ఘట్టాన్ని వీక్షించిన భక్తజనం అంతరంగంలో పులకించిపోయారు…

అయోధ్య నగరమంతా రామ నామంతో మార్మోగింది…

ఈ మహత్కార్యానికి దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు, స్వామీజీలు కలిపి దాదాపు 7వేల మంది విచ్చేశారు..

రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రత్యక్షంగా తిలకించి పులకించిపోయారు…

అయోధ్య నగరమంతా రామ్ లీలా, భగవద్గీత కథలు, భజనలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించింది…

Print Friendly, PDF & Email

TEJA NEWS