TEJA NEWS

Increased strength of Congress in Telangana Assembly

తెలంగాణ అసెంబ్లీలో పెరిగిన కాంగ్రెస్ బలం

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతం ఆ పార్టీ బలం 70కి చేరింది. తెల్లం వెంకటరావు (భద్రాచలం), దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), సంజయ్ (జగిత్యాల) హస్తం గూటికి చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39 సీట్లు సాధించాయి. ఇటీవల కంటోన్మెంట్ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ గెలవడంతో మొత్తంగా కాంగ్రెస్ బలం 70కి పెరిగింది.


TEJA NEWS