బుధ. మార్చి 11th, 2026

భూగర్భ డ్రైనేజీ మరమ్మత్తుల తో వాహనాల రాకపోకలకు అంతరాయం

WhatsApp Image 2025 03 24 at 18.04.52
WhatsApp Image 2025 03 24 at 18.04.52
TEJA NEWS

భూగర్భ డ్రైనేజీ మరమ్మత్తుల తో వాహనాల రాకపోకలకు అంతరాయం.

కమిషనర్ ఎన్.మౌర్య

నగరంలోని తిరుమల బైపాస్ రోడ్డు లోని 47 వ నంబర్ పిల్లర్ వద్ద భూగర్భ డ్రైనేజీ కాలువ మరమ్మత్తులు చేయనుండడం వలన వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల బైపాస్ రోడ్డులోని ఎస్.కే.ఫాస్ట్ ఫుడ్ సమీపంలోని 47 వ నంబర్ పిల్లర్ వద్ద భూగర్భ డ్రైనేజీ కాలువల లీకేజి రావడం జరిగింది. ఈ పైప్ లైన్ పూర్తి తవ్వి మరమ్మత్తులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు సుమారు ఐదు రోజులపాటు జరగనున్నాయి. ఈ ఐదు రోజులపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుంది. కావున వాహన చోదకులు, ప్రజలు సహకరించాలని కమిషనర్ ఆ ప్రకటనలో కోరారు. ఈ మరమ్మత్తు పనులను పోలీసు అధికారులతో కలసి మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, డి.ఈ. లలిత పర్యవేక్షిస్తున్నారు.

By teja news

teja news is a digital platform ,teja news provides latest news updates

Related Post

You cannot copy content of this page