కార్పోరేట్ కళాశాలల యందు ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

కార్పోరేట్ కళాశాలల యందు ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

TEJA NEWS

2024-25వ విద్యా సంవత్సరం లో కార్పోరేట్ కళాశాలల యందు ప్రవేశము పొందుటకు మార్చి -2024 లో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థిని /విద్యార్ధులు తేది 15.05.2024 నుండి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తునట్లు సూర్యాపేట జిల్లా షెడ్యుల్డ్ కులముల అభివృద్ధి అధికారి శ్రీమతి కె.లత ఒక ప్రకటనలో తెలిపారు. యస్.సి.యస్.టి.బి.సి., పి.హెచ్.సి మరియు మైనారిటీ విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in అంతర్జాలం ద్వారా సంబంధిత ధ్రువ పత్రాలతో దరఖాస్తులు చేసుకోవాలని తెలియజేశారు. ఈ అవకాశం మార్చి -2024 లో పదవ తరగతిలో ఉత్తీరులై జి.పి.ఏ.7.0 ఆ పైన జి.పి.ఏ. సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులు. ఇట్టి కార్పోరేట్ కళాశాలల్లో ప్రవేశానికి ప్రభుత్వ షెడ్యుల్డ్ కులముల వసతి గృహముల యందు వసతి పొంది ప్రభుత్వ పాఠశాలలో విద్యనబ్యాసించిన విద్యార్థిని /విద్యార్ధులు, మోడల్ స్కూల్, కేజీబీవి, ప్రభుత్వ, ఎయిడెడ్ . మున్సిపల్ జిల్లా పరిషత్, ప్రభుత్వ రెసిడెన్షియల్, జవహర్ నవోదయ విద్యాలయం, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల యందు చదివిన విద్యార్థిని /విద్యార్ధులకు కార్పోరేట్ కళాశాల యందు ఉచితంగా ప్రవేశం కల్పించాబడునని తెలిపారు. కావున ఆసక్తి కలిగిన మార్చి 2024లో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్ధిని / విద్యార్ధులు అన్ లైన్ ద్వారాదరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ముఖ్యమైన తేదీలు:-

దరఖాస్తులు అన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొనుటకుతేది 15.05.2024 నుండి తేది 30.05.2024 వరకు.

సెలక్షన్ లిస్ట్ 03.06.2024

ఎంపికైన విద్యార్ధుల ధ్రువ పత్రముల పరిశీలన, కళాశాలల అల్లాట్మెంట్ ఆర్డర్స్ పొందుట తేది 06.06.2024.

Print Friendly, PDF & Email

TEJA NEWS