TEJA NEWS

ఆనందోత్సవాన్ని నింపిన జగిత్యాల ఆల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల స్వాగతోత్సవ్

సాంస్కృతిక కార్యక్రమాలతో నూతన ఉత్సాహం కలుగుతుందని మరియు వివిధ కార్యక్రమాలను చాలా ఉషారుగా పూర్తి చేయవచ్చనని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥వి. నరేందర్ రెడ్డి స్థానిక ఒక ప్రవేట్ వేడుక మందిరంలో ఆకాశమే హద్దుగా స్వాగతోత్సవ్ పేరుతో వైభవంగా నిర్వహించినటువంటి కళాశాల ప్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు వారు చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహానికి పూల మాల వేసి సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను అట్టహాసంగా ప్రారంభించారు.

నేడు చాలా మంది విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని మరియు అనుకున్న లక్ష్యాలను చాలా సులభంగా ఛేదిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరు తరగతి గదుల్లో చాలా ఉత్తమంగా వ్యవహరించి, శ్రద్ధతో, ఏకాగ్రతతో అధ్యాపకులు భోదించే విషయాలను సమగ్రంగా విని విశ్లేషించుకోవాలని కోరారు. తల్లిదండ్రులు వారి పిల్లిలకు కావల్సిన వనరులను సమకూర్చి వారిని అగ్రప్రేనిలో నిలుపేందుకు ప్రోత్సాహం అందించి సాధించే దిశగా పయనించాలను సూచించారు. మన దేశం నుండి రాష్ట్ర ప్రతినిధులు అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తు విద్యార్థులను ఎల్లపుడు ప్రోత్సహిస్తూ వారికి ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తున్నారని చెప్పారు. వివిధ పనులకు ఆకర్షితులై ఉజ్వల భవిత్ను వృదా చేసుకోవద్దని చెప్పారు. చిన్ననాటి మండే ఉత్తమంగా వ్యవహరించి సమాజానికి ప్రతీకగా ఉండాలని చెప్పారు.

విద్యార్థులు సంచలన విజయాలను నమోదు చేయడం చాలా అభినందనీయమని మరియు మొదటి నుండే ఉత్తమంగా వ్యవహరిస్తు చాలా చక్కటి పేరు ప్రఖ్యాతలను స్వంతం చేసుకోవడం వారి వ్యవహరా శైలికి ఒక గొప్ప విదర్శనమని అభివర్ణించారు.

గత 34 సం॥లుగా అల్ఫోర్స్ విద్యాసంస్థలు నిర్విరామంగా వారటకంగా కృషి చేస్తున్నదని మరియు విద్యాభివృద్ధికి నూతన ఒరవడిని సృష్టిస్తు సమాజంలో వెలుబడుతున్న మార్పులకు అనుగుణంగా మరియు ప్రవేశపెడుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగడమే కాకుండా సంచలనాత్మక విజయాలను నమోదు చేస్తు నూతన అధ్యాయాలకు బీజం పోస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను అన్ని రకాలుగా అభివృద్ధి పరచడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు.

వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి ఓ మై ఫ్రెండ్. జయ్ సియరామ్ ఐయ్ జయ్ సియరామ్, గువ్వాగోరింకతో, చలియా చలియా… నృత్యాలు చాలా అలరించాయి మరియు వార్షిక ప్రణాళికల్లో భాగంగా నిర్వహించిన వెలు పరీక్షలల్లో మరియు క్రీడల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు డా॥వి. నరేందర్ రెడ్డి బహుమతులను ప్రధానం చేశారు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశయాలను ఎప్పటికప్పుడు సాధిస్తు వారి దృష్టిలో అత్యుత్తమ పిల్లలుగా ఖ్యాతి ఘడించాలని అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్, అధ్యాపకలు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS