జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నేలపోగుల గ్రామంలో ఉరుములు, మెరుపులు, తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలో గ్రామంలోని యాదయ్య ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు మొత్తం కాలిపోయింది. ఇలా చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇంకా వర్షాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-20-at-1.01.48-PM.jpeg)