మోసపూరిత కాంగ్రెస్ కు ఓటుతో తగిన బుద్ధి చెబుదాం

మోసపూరిత కాంగ్రెస్ కు ఓటుతో తగిన బుద్ధి చెబుదాం

TEJA NEWS

వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” కోట్ పల్లి మండలం లోని ఎన్నారం గ్రామం లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ప్రచారం లో భాగంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందన్నారు, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలు పక్కన పెట్టి కాలయాపన చేస్తూ దేవుళ్ళ మీద ఒట్లు వేస్తూ ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు . గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను రుణమాఫి పై రైతులు నిలదీయాలని తెలిపారు.

మోసపూరిత కాంగ్రెస్ కు ఓటుతో తగిన బుద్ధి చెబుదామన్నారు.
కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు

అనంతరం కోట్ పల్లి మండలం సీనియర్ నాయకులు సత్యం తండ్రి మరణించారాని తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు మరియు బీరెల్లి గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్త నర్సింలు ఇటీవల మరణించటం తో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులని పరామర్శించారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకొంటూ, వారి కుటుంబానికి ఆయన ప్రగడ సానుభూతి తెలియజేశారు.

ఈ కార్యక్రమాల్లో కోట్పల్లి మండల అధ్యక్షులు సుందరి అనిల్, PACS చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, వైస్ MPP నర్సింలు, యూత్ అధ్యక్షులు కొండల్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు యాకుబ్, ex-MPTC లక్ష్మణ్, సీనియర్ నాయకులు జయానంద్, మాజీ సర్పంచ్ రామ్ ప్రసాద్, నాయకులు బాలేష్ మహబూబ్, హుస్సేన్, మొయినొద్దిన్, వీరేశం, శీను, బాబు నాయక్, రషీద్, అలీ, మజర్, వెంకటేశం, కృష్ణ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, అనిల్, రవి తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS