TEJA NEWS

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు , స్థానిక డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా శంభిపూర్ రాజు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిని కొనసాగించాలంటే ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి ని మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పాక్స్ చైర్మన్ ఎం. బాలరెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు, నాయకులు డివిజన్ అధ్యక్షులు,డివిజన్ మహిళా నాయకురాలు,యువ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS