TEJA NEWS

ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి

మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నిజాంపేట్ 20వ డివిజన్ లో ఇంటింటి ప్రచారంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,ఎన్ ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు బాలాజీ నాయక్, సుజాత, ఆగం రాజు, కో ఆప్షన్ సభ్యలు సయ్యద్ సలీం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, నాయకులు, డివిజన్ అధ్యక్షులు,మహిళా నాయకులు, అసోసియేషన్ సభ్యులు, స్థానికులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS