TEJA NEWS

స్థానిక 124 డివిజన్ భవ్య తులసి వనం అపార్ట్మెంట్స్ ఎదురుగా తరచూ జరుగుతున్న ప్రమాదాలని దృష్టిలో పెట్టుకొని శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి శిరీష సత్తూర్ శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ కి విన్నవించుకోవడం జరిగింది. విషయం తెలుసుకున్న జగదీష్ గౌడ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసిపి, జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్ సభ్యులంతా తులసివనం చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అపార్ట్మెంట్ ఎదురుగా వేగంగా వచ్చి పోయే వాహనాలను అరికట్టడానికి గాను స్పీడ్ బ్రేకర్స్ మరియు డివైడర్లను ఏర్పాటు చేయాల్సిందిగా శ్రీమతి శిరీష సత్తూర్ విన్నవించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి వెంకటయ్య , సిఐ , ఎస్సై , జిహెచ్ఎంసి స్టాప్, తులసి వనం వాసులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS