సౌడమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

సౌడమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

TEJA NEWS

May all people be happy with the blessings of Saudamma's mother

సౌడమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి : తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

…..

సౌడమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట మండలంలోని టేకుమట్ల గ్రామంలో యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీశ్రీశ్రీ సౌడమ్మ తల్లి జాతర ప్రారంభం కాగా సౌడమ్మ తల్లిని దర్శించుకొని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఆనాదిగా వస్తున్న ఆచార, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, సౌడమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో
రమేష్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గట్టు శ్రీనివాస్, ఎడ్ల వీరమల్లు యాదవ్, దరావత్ వెంకన్న నాయక్, షఫీ ఉల్లా, దేవేందర్, పారుక్, యాట ఉపేందర్, ధర్మా, కరుణాకర్ రెడ్డి, మండల్ రెడ్డి వేణు గోపాల్ రెడ్డి, యాదవ సంఘ నాయకులు జాల మాణిక్యం యాదవ్, జాల జానయ్య యాదవ్, బొర్రాజు నాగయ్య యాదవ్, జాల శంకర్ యాదవ్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS