ప్రమాదవశాత్తు మున్నేరు హైవే పిల్లర్ గుంతలో పడి మృతి చెందిన ముగ్గురు పిల్లల కుటుంబ సభ్యులను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. నగరంలోని రామ చంద్రయ్య నగర్ లో నివాసముంటున్న వారి ఇళ్లకు వెళ్లి మృతదేహాలకు నివాళులు అర్పించారు. ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని బాధపడ్డారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
Posted inTELANGANA