వరంగల్ విమానాశ్రయంపై కదలిక
వరంగల్ ప్రాంతీయ విమానాశ్రయ నిర్మాణం వ్యవహారంలో కదలిక వస్తోంది. ప్రాథమిక భూ సర్వే కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కసరత్తు చేపట్టింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం అదనపు భూమి కేటాయించటంతో ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు సంబంధించిన హెలికాప్టర్లు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించాయి. విమానాశ్రయం అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.750కోట్ల వరకు వెచ్చించాల్సి ఉన్నట్లు సమాచారం.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-22-at-6.11.34-PM.jpeg)