బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం
సిద్దిపేట జిల్లా బీజేపీ ఆర్మీ సెల్ అధ్యక్షులు గా రాయపోల్ మండలం అనాజిపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ నీల చంద్రం ను నియమించారు..సిద్దిపేట లో జిల్లా పార్టీ కార్యాలయంలో నీల చంద్రం కు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి నియామక పత్రం అందించారు. ఆర్మీ జవాన్ గా 18 ఏళ్ళు దేశం కోసం పనిచేసిన నీల చంద్రం ఇటీవల పదవీ విరమణ చేశారు..అనంతరం ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు..సైనికునిగా పనిచేస్తూనే గజ్వెల్ లో ఆజాద్ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేసి ఎంతో మంది యువకులకు శిక్షణ అందించి ఆర్మీ లో అవకాశం కల్పించారు..తనపై నమ్మకం తో జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షుడు గా అవకాశం కల్పించడంపై ఎంపీ ఎం రఘునందన్ రావు కి, జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి కి, జిల్లా కార్యదర్శి విభూషన్ రెడ్డికి, రాయపోల్ మండల పార్టీ అధ్యక్షుడు రాజా గౌడ్ కి, బీజేపీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఆర్మీ కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు
బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
TEJA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
TEJA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…