ఓటర్లు పెద్దఎత్తున తరలిరావాలి : ప్రధాని మోడి పిలుపు..

ఓటర్లు పెద్దఎత్తున తరలిరావాలి : ప్రధాని మోడి పిలుపు..

TEJA NEWS

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైన వేళ … ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువకులు, తొలిసారి ఓటు వేయబోతున్నవారికి ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి విదితమే.

వివిధ భాషల్లో మోడి పోస్ట్‌ …”2024 లోక్‌సభ ఎన్నికలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఆయా నియోజకవర్గాల్లో ఓటు వేసే వారందరూ తమ ఓటు హక్కును రికార్డు సంఖ్యలో వినియోగించుకోవాలని కోరుతున్నాను.

యువకులు, మొదటిసారి ఓటు వేయనున్నవారు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిస్తున్నాను.

ప్రతిఒక్కరి ఓటూ ప్రధానమే!” అని మోడి ఎక్స్‌లో వివిధ భాషల్లో పోస్ట్‌ చేశారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS