Spread the love

ప్రజా సంక్షేమమే నా దృఢ సంకల్పం — కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద రోజువారి కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు..

అనంతరం పలు ఆహ్వానాలు, వినతిపత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు..నియోజకవర్గం ప్రజల అభివృద్దే నా లక్ష్యం అన్నారు..

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజలు, నాయకులు, సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..