TEJA NEWS

హైదరాబాద్‌: రాచకొండ పోలీస్‌ బాస్‌ మళ్లీ మారారు. 2001 బ్యాచ్‌కు చెందిన జి.సుధీర్‌బాబును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన తరుణ్జోషిని బదిలీ చేసిన ప్రభుత్వం మళ్లీ జి.సుధీర్‌బాబుకు బాధ్యతలు అప్పగించింది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం డిసెంబరు రెండోవారంలో రాచకొండ కమిషనర్‌గా సుధీర్‌బాబును నియమించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి రెండోవారంలో ప్రభుత్వం సుధీర్‌బాబును బదిలీ చేసి తరుణ్‌జోషికి బాధ్యతలు అప్పగించింది. ఇటీవల ఎన్నికలు ముగియడంతో మళ్లీ సుధీర్‌బాబుకు బాధ్యతలు అప్పగించింది. ఉత్తర్వులు వెలువడ్డ కొద్ది గంటల్లోనే సుధీర్‌బాబు నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో బాధ్యతలు చేపట్టారు.


TEJA NEWS