పార్టీని బలోపేతం చేస్తా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి

పార్టీని బలోపేతం చేస్తా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి

TEJA NEWS

పార్టీని బలోపేతం చేస్తా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి
ఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షరాలు గా ఎన్నికైన గోదావరి అంజి రెడ్డి గారిని సంగారెడ్డి జిల్లా బిజెపి నాయకులు కార్యకర్తలు స్వాగతం పలుకుతూ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం నా మీద నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక చేసిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశానుసారం సాయి నగర్ కాలనీలో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం నందు జరిగింది. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, సంగారెడ్డి కన్వీనర్ పోచారం రాములు, జహీరాబాద్ కన్వీనర్ జనార్దన్ రెడ్డి, నారాయణఖేడ్ కన్వీనర్ రజనీకాంత్, ఆందోల్ కన్వీనర్ చంద్రశేఖర్, బిజెపి సీనియర్ నాయకులు అనంతరావు కులకర్ణి, ప్రతాప్ రెడ్డి, ముత్తిరెడ్డి, సంగారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ పులిమామిడి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యరావు, సంగారెడ్డి సంగారెడ్డి యువ మోచా అధ్యక్షులు పవన్, కౌన్సిలర్ నాగరాజు, వాసు, పటాన్చెరు టౌన్ అధ్యక్షులు నరేష్, భారతి నగర్ డివిజన్ మాజీ అధ్యక్షులు నందా రెడ్డి, మాజీ సూపర్డెంట్ డాక్టర్ రాజు గౌడ్, మల్లేష్, వెంకటేష్, సంగారెడ్డి జిల్లా ఓబీసీ మోచ మాజీ అధ్యక్షులు కిష్టయ్య, లక్ష్మణ్, రామచంద్రపురం పట్టణ యువమోచా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్, రామచంద్రపురం పట్టణ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు బసమ్మ, భారతి నగర్ డివిజన్ ఉపాధ్యక్షురాలు గీత, కనకరాజు, రాములు, భూపాల్ రెడ్డి, రాజు, జైపాల్ రెడ్డి, పెంట రెడ్డి, సత్యనారాయణ, సుధాకర్, మహేష్, చిలుకా రాము, కృష్ణారెడ్డి, రామచంద్రపురం పట్టణ ప్రధాన కార్యదర్శి బలరాం, సాయికృష్ణ, వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS