
మహిళలకు స్వయం ఉపాధి కల్పన, ఆర్థిక స్వాలంబనే ధ్యేయం
మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల పక్షపాతి
- మైనారిటీ మహిళ సోదరీమణులకు ఉచితంగా 200 మంది లబ్దిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ* ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా శక్తి పథకం రేవంతన్న భరోసా కార్యక్రమంలో భాగంగా మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ ద్వారా ఉచితంగా 200 మంది మైనారిటీ మహిళ సోదరీమణులకు కుట్టు మిషన్ల ను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , రాగం నాగేందర్ యాదవ్ , నార్నె శ్రీనివాస రావు , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ నవీన్ కుమార్ రెడ్డి తో కలిసి 200 మంది లబ్దిదారులకు అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా శక్తి పథకం రేవంతన్న భరోసా పథకం కింద మైనార్టీ సోదరీమణులకు ఉచితంగా 2 00 మందికి కుట్టు మిషన్లు అందచేయడం చాలా సంతోషకరమైన రోజు అని ,పేద మహిళ ల జీవితాలలో వెలుగులు నింపిన రోజు అని,మహిళలు ఆర్థికంగా ఎదగడానికి గొప్ప అవకాశంను ప్రభుత్వం కలిపించింది అని , మహిళలు తమ స్వంత కాళ్ళ పై నిలబడి కుటుంబ పోషణ కు చేదోడు వాదోడుగా ఉండదుకు ఎంతగానో ఉపయోగపడతాయి అని ,ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుటుంన్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల పక్షపాతి అని ,గొప్ప మనసున్న నేత అని, మహిళల సంక్షేమం కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టింది ఒక తెలంగాణ ప్రభుత్వమే అని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పెండ్లికి భరోసా కల్పిస్తున్నారు .మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ కుట్టు మిషన్లు ఎంతగానో ఉపయోగపడతాయి అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.మహిళలను అన్ని రంగాల్లో ముందు నిలిచేలా చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని PAC చైర్మన్ గాంధీ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ రీజినల్ ఆఫీసర్ కులకర్ణి, AGM పాసరి, షాజియా బేగం, నజియా బేగం మరియు మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
