శంకర్పల్లి మండల పరిధి పర్వేద అనుబంధ గ్రామమైన కొత్తగూడెంలోని శ్రీ పాతాళ త్రికోణ సుందరి ఆలయంలో ఈనెల 8వ తేదీ బుధవారం ఉదయం గంటలు 11.15 నిమిషాలకు శివ శంకరి శుభ మంగళ మహాయజ్ఞం ఉంటుందని ఆలయ ధర్మకర్త మాధవరెడ్డి తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి యజ్ఞంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించగలరని ఆయన కోరారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-06-at-5.49.08-PM-1024x682.jpeg)