TEJA NEWS

భారత స్వాతంత్ర సంగ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి ఆ పోరాటంలోనే ప్రాణాలర్పించిన మన్యం విప్లవ వీరుడు. ఆ మహనీయుడి127 వ జయంతిని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని జె. పి.ఎన్ నగర్ లో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ భారత దేశ స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని , మన్యం ప్రజలలో విప్ల బీజాలు  నాటి ప్రజలను  చైతన్య  పరిచి   స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేలా చైతన్య పరిచిన  మహానుభావుడు అల్లూరి అని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు అదేవిధంగా భారత దేశ స్వాతంత్రము కోసం ప్రాణాలు  అర్పించిన మహనీయుడు అని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు,అల్లూరి సీతారామ‌రాజు 22 ఏళ్ల చిన్న వ‌య‌సుల్లోనే మ‌న్యం ప్ర‌జ‌ల‌ను క‌లుపుకుని బ్రిటీషు పాల‌న‌ను ఎదిరించిన గొప్ప యోధుడ‌ని, సాయుధ పోరాటం ద్వారా మాత్రమే భారతదేశానికి బ్రిటిష్ పాల‌న నుంచి విముక్తి ల‌బిస్తుందని న‌మ్మి.. తెల్ల‌దొర‌ల పైకి విల్లు ఎక్కుపెట్టిన ధీరుడు అని అతి చిన్ని వ‌య‌సులోనే బ్రిటిష‌ర్ల‌ను 2 సంవత్సరాలు కంటిమీద కునుకు లేకుండా చేసి గ‌డ‌గ‌డ‌లాడించిన అల్లూరిని తుపాకుల‌తో కాల్చి చంపుతున్న వందేమాత‌రం అనే నినాదించిన గొప్ప మ‌హానీయుడు అని, అయన జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయం అని , ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచినా గొప్ప వ్యక్తి అని, ఆయన అడుగు జాడలో యువత నడవాలని ఎమ్మెల్యే గాంధీ   పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్వర్ షరీఫ్, పూర్ణచందర్ రావు, చంద్రిక ప్రసాద్,ఉమ, జంగం మల్లేష్, నర్సింలు గౌడ్, గంగాధర్, రమాదేవి మరియు రంగరాజు, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసరావు, దుర్గరాజు,కృష్ణంరాజు, కాట్రగడ్డ సత్యనారాయణ, వర్మ, శివ, బలరామకృష్ణ, రవి,సత్యనారాయణ రాజు,పవన్, సూరి, నాగరాజు మరియు క్షత్రియ యూత్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
,,,,,,,,,,,,,,,,,,,,,,,


TEJA NEWS