TEJA NEWS

ధర్మపురి
వెల్గటూర్ గ్రామంలోని శ్రీ రామ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్బంగా” బందెల మల్లేష్ – లక్ష్మి” దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతలను ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ గౌడ్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి స్వామి వారి యొక్క జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో తాజామాజీ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, మాజీ ఉప సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS