
అమరావతి:
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శాసనసభ ప్రత్యేక హక్కుల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో విశాఖ డెయిరీకి సంబంధించిన అంశంపై కమిటీ సమగ్రంగా చర్చించింది. విశాఖ డెయిరీ అభివృద్ధి, పాల ఉత్పత్తిదారుల సంక్షేమం, సంస్థ పురోగతికి సంబంధించిన పలు అంశాలపై సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు విశాఖ డెయిరీని మరింత బలోపేతం చేయడంతో పాటు పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
శాసనసభ ప్రత్యేక హక్కుల కమిటీ ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించి అవసరమైన సూచనలు చేశారు.
ప్రజా ప్రయోజనాల పరిరక్షణ, రైతులు మరియు పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం ప్రభుత్వం, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని పల్లా శ్రీనివాసరావు కోరారు.
