విద్యార్థులు మత్తు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అవగాహన నిఘ ఉంచాలని అధికారుల కు సూచించిన ……. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
వనపర్తి :
విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల జోలికి పోకుండా అవగాహనతో పాటు నిఘా ఉంచాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు.
మధ్యాహ్నం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి నార్కోటిక్ కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో యాంటి డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అన్ని సంక్షేమ హాస్టళ్లలో, గురుకుల, కే.జి.బి.వి ల్లో కమిటీ ద్వారా అవగాహన కల్పించడంతో పాటు నిఘా పెట్టాలన్నారు. పోలీస్ శాఖ ద్వారా మత్తు పదార్థాలను గుర్తించి శునకాలతో తనిఖీ చేయించాలని పోలీస్ శాఖను సూచించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఇప్పటి వరకు ఉన్న గంజాయి సాగు కేసులపై వివరాలు అడిగారు.
ఎక్కడైనా మాదక ద్రవ్యాల ఉత్పత్తి కానీ వాడకం కానీ జరిగినట్లు తెలిస్తే 8712671111 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం వాటి అనర్తాల పై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ యం . నగేష్, ఆర్డీఓ పద్మావతి, అడిషనల్ ఎస్పీ తేజావత్ రామదాసు నాయక్, విద్యా శాఖ అధికారి గోవిందరాజులు, సంక్షేమ శాఖ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు మత్తు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అవగాహన నిఘ
Related Posts
వినాయకునికి ప్రత్యేక పూజలు
TEJA NEWS వినాయకునికి ప్రత్యేక పూజలు || కుత్బుల్లాపూర్నియోజకవర్గం 128 డివిజన్ చింతల్ వాసులు నిర్వహించిన వినాయక ఉత్సవాలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా వినాయకుని ప్రత్యేక పూజలో పాల్గొని ప్రజలందరూ ఆయువు…
పెద్దపెల్లి జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం పర్యటన
TEJA NEWS పెద్దపెల్లి జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న రామగుండం సిపి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పెద్దపల్లి జిల్లా :పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం తెలం గాణ ఉప ముఖ్యమంత్రి మల్లు…