బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఇన్ఛార్జి
హైదరాబాద్: బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్(ఎస్ఈ) కె.జగజ్యోతి అవినీతి నిరోధకశాఖ(అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. గంగన్న అనే కాంట్రాక్టర్కు నిజామాబాద్లో పూర్తిచేసిన పనికి బిల్లు మంజూరవ్వగా.. హైదరాబాద్ శివార్లలోని గాజుల రామారంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జువైనల్ బాలుర వసతిగృహం కాంట్రాక్టునూ ఆయనే దక్కించుకున్నారు. నిజామాబాద్లో పూర్తయిన పనికి బిల్లులు మంజూరు చేయడం, గాజుల రామారం పనికి అంచనాలు సవరించేందుకుగాను జగజ్యోతి లంచం డిమాండు చేశారు. దీనిపై…