ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి.
సాక్షిత పటాన్చెరు :బిఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని మహిళా ప్రజాప్రతినిధులు, కార్యకర్తల బృందం పటాన్చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ కాలనీ, గౌతమ్ నగర్ కాలనీ, సీతారామయ్య పురం కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి పదేళ్లలో డివిజన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ, కారు గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి…