
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను పంపిణీ చేసిన గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు .
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పటల్లో చికిత్స చేయించుకుని మరియు ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 66 (46 చెక్కులు 20 LOC లను) మంది లబ్ధిదారులకు గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు రూ. 72,40,146/- (డెబ్బై రెండు లక్షల నలబై వేల నూటా నలబై ఆరు) రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు 896 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా రూ. 8,74,89,645/- (ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల యనబై తొమ్మిది వేల ఆరు వందల నలబై ఐదు) రూపాయలను చెక్కుల రూపంలో యరపతినేని అందజేయడం జరిగింది.