బోనాలు నిధులకు ఆలయాల నిర్వాహకులు దరఖాస్తు చేసుకోండి

బోనాలు నిధులకు ఆలయాల నిర్వాహకులు దరఖాస్తు చేసుకోండి

TEJA NEWS

Temple administrators apply for bonus funds

బోనాలు నిధులకు ఆలయాల నిర్వాహకులు దరఖాస్తు చేసుకోండి

ఎం.ఎల్.ఏ. శ్రీ పద్మారావు గౌడ్ సూచన
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వివిధ అమ్మవారి దేవాలయాల నిర్వాహకులు బోనాలు నిధుల మంజురుకు వెంటనే దరఖాస్తులు అందించాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్ సూచిస్తున్నారు. ప్రతీ ఏటా బోనాలు సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి దేవాలయాలకు అలంకరణ, ఇతరత్రా అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసే సంప్రదాయాన్ని పాటిస్తోంది. గత సంవత్సరం నిధులు పొందిన ఆలయాల నిర్వాహకుల దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తారు. తమ ఆలయం లెటర్ హెడ్ తో పాటు ఆలయం ఫోటో, ప్రెసిడెంట్/సెక్రటరీ ఆధార్ కార్డు జెరాక్స్, ఆలయం బ్యాంక్ అక్కౌంట్ వివరాలు, నిధుల వినియోగం వివరాలతో యుటిలైజేషన్ సర్టిఫికేట్, రెండు రెవిన్యూ స్టాంప్స్ అందచేయగలరు. గత సంవత్సరం పొందిన చెక్కు జెరాక్స్ కాపీని కూడా అందించాల్సి ఉందని సూచించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి