ప్లాస్టిక్ ఫ్రీ జాతర గా నిర్వహించాలి

ప్లాస్టిక్ ఫ్రీ జాతర గా నిర్వహించాలి

TEJA NEWS

పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

పారిశుద్ధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనసూయ సీతక్క, పంచాయతి రాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్

గురువారం మేడారంలోని హరిత హోటల్ సమావేశం మందిరంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యం లో పారిశుధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అనసూయ సీతక్క, పంచాయతి రాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్ హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జాతర సమయం దగ్గర పడుతున్న తరుణంలో భక్తుల తాకిడి రోజురోజుకి పెరుగుతుంది కాబట్టి అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని అన్నారు.భక్తులకు ముఖ్యంగా నిరంతరం త్రాగు నీరు అందిచలని అన్నారు.జాతర లో జాతర ముగిసిన అనంతరం కూడా ముమ్మరంగా పారిశుధ్య పనులు కొనసాగించాలని అన్నారు.

అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన పంచాయతీరాజ్ కమిషనర్ మాట్లాడుతూ జాతరలో విధులు నిర్వర్తించే అధికారులు చిత్త శుద్ది తో సమన్వయంతో సేవలు అందించాలని జాతరలో ముఖ్యంగా గద్దెల ప్రాంగణంలో బెల్లం కొబ్బరికాయలు శుభ్రం చేయాలని అలాగే జంపన్న వాగు సమీపం లో భక్తుల తలనీలాలు కూడా శుభ్రం చేయాలని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది మిషనరీ యంత్రాల ద్వారా నిరంతరం విధులు నిర్వహించాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ జిల్లాల నుంచి జాతర విధులుకు వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా 19 తేదీన సంబంధిత జోనల్ అధికారులకు రిపోర్ట్ చేయాలి అని అన్నారు.జాతర లో పారిశుధ్య పనులు చేయడం కోసం 10 సెక్టార్లు, 60 సబ్ సెక్టార్స్ గా విభజించడం జరిగింది అని డి పి ఓ, డి ఎల్ పి ఓ ల ఆధ్వర్యం లో పారిశుధ్య పనులు జరుగుతాయని ఫీల్డ్ లో ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.

అదనపు కలెక్టర్ పి శ్రీజ మాట్లాడుతూ అధికారులకు కేటాయించిన జోన్ లలో విధులు నిర్వహించాలని ప్రతి జోన్ కు ఎం పి ఓ స్థాయి అధికారి నీ కేటాయించడం జరిగింది అని జాతర సమయంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శబరిష్ , డి పి ఓ లు , డి ఎల్ పి ఓ, వివిధ జిల్లాల జోనల్ అధికారులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS