హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. BRS MLA పాడి కౌషిక్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి జరిపిన నేపథ్యంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో ముందస్తు చర్యలలో భాగంగా మారేడ్ పల్లి CI నోముల వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. తన హెల్త్ బాగోలేదని, డాక్టర్ వద్ద అపాయింట్ మెంట్ ఉన్నదని వెళ్లాలని MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించినా పోలీసులు వినలేదు…కారు ఎక్కకుండా అడ్డుకున్నారు. దీంతో MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దాడులు, ప్రతిదాడులు ప్రజాస్వామ్యంలో సరైనవి కావన్నారు. దాడులు చేయడం, రెచ్చగొట్టడం వంటి చర్యలతో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించవద్దని అన్నారు. సమస్యకు పరిష్కారం చూడకుండా అరెస్ట్ లు, అడ్డుకోవడాలు తగదన్నారు. శాంతిబద్రతలకు విఘాతం కల్పిస్తే హైదరాబాద్ నగర ప్రతిష్ట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. హౌస్ అరెస్ట్ అయిన వారిలో MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు రాంగోపాల్ పేట, మోండా మార్కెట్ డివిజన్ BRS పార్టీ అద్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, కిషోర్ తదితరులు ఉన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలువురు BRS పార్టీ నాయకులను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయవద్దని మాజీమంత్రి
Related Posts
హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు.
TEJA NEWS హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు. చెరువులు, కుంటలలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళతామని వివరించారు.…
కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం
TEJA NEWS కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం బీజేపీ రాజకీయానికి నిదర్శనం.సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూసుఫ్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం సాయంత్రం మక్డుంనగర్ నాగయ్య స్తూపం దగ్గర అమరవీరులకు…