TEJA NEWS

అసంపూర్తి గా మిగిలిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం పూర్తి చేయాలి…………. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

*సాక్షిత వనపర్తి
నియోజకవర్గంలోని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు బి ఆర్ ఎస్ ప్రభుత్వము తన హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయించి నిర్మించి ఇవ్వడం జరిగిందని మరికొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం బిల్లులను మంజూరు చేయించడం జరిగిందని మంజూరైన నిధులు విడుదల కాక నియోజకవర్గంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అసంపూర్తిగానే మిగిలిపోయాయని మరికొన్ని చిన్నచిన్న పనుల మిగిలి ఆగిపోయాయనికాంగ్రెస్ ప్రభుత్వం మంజూరి అయినా నిధులను విడుదల చేసి అసంపూర్తిగా మిగిలి ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని కి విజ్ఞప్తి చేశారు నియోజకవర్గం లోని పెబ్బేరు మండలం పాత పల్లి గుమ్మడం గ్రామాలలో తన హయాంలో మంజూరు చేయించి నిర్మాణాలను చేపట్టి అసంపూర్తిగా మిగిలి ఉన్న ఇండ్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ గజ్వేల్ తర్వాత అత్యధికంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల ను వనపర్తి నియోజకవర్గానికి మంజూరు చేయించడం జరిగిందని అందులో భాగంగానే పాత పల్లికి 50 గుమ్మడం గ్రామానికి 100 డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించడం జరిగిందని ప్రస్తుతం అవి నిధుల కొరతతో అసంపూర్తిగా మిగిలిపోయాయని నియోజకవర్గం వ్యాప్తంగా అసంపూర్తిగా మిగిలిపోయిన డబల్ బెడ్ రూమ్ (డి పి ఆర్ ) డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో సహా జిల్లా కలెక్టర్కు వివరించడం జరిగిందని కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేసి అసంపూర్తిగా మిగిలి ఉన్న డబల్ బెడ్ రూమ్ నిర్మాణాలను పూర్తి నిరుపేదలకు అందివ్వాలని
ఆయన డిమాండ్ చేశారు ఆయన వెంట పాత పల్లి గోవిందు గ్రామ బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS